ఎంపీ వద్దిరాజు కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ

Spread the love

ఖమ్మం జిల్లాలో రోడ్ల విస్తరణ, అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర మంత్రి గడ్కరీకి వినతిపత్రమిచ్చిన ఎంపీ రవిచంద్ర
సానుకూలంగా స్పందించిన మంత్రి గడ్కరీ
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు.పార్లమెంటులోని మంత్రి ఛాంబర్ లో మధ్యాహ్నం ఆయన గడ్కరీని కలిశారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తల్లాడ- కల్లూరు-పెనుబల్లి-సత్తుపల్లి మార్గాన్ని మరింత విస్తరస్తూ, అభివృద్ధి పర్చుతూ,సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా వినతిపత్రం అందజేశారు.ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేయవలసిందిగా ఎంపీ రవిచంద్ర కోరగా, మంత్రి గడ్కరీ వెంటనే సానుకూలంగా స్పందిస్తూ అధికారులకు తగు ఆదేశాలిచ్చారు.

Related Posts

You cannot copy content of this page