ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ప్రమాణ స్వీకార వేడుకకు భారీ సంఖ్యలో తరలివెళ్లిన తెలుగు తమ్ముళ్లు

Spread the love

కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ప్రమాణ స్వీకార వేడుకకు భారీ సంఖ్యలో తరలివెళ్లిన తెలుగు తమ్ముళ్లు.

అంతకుముందు కంచర్ల శ్రీకాంత్ ని, ఇంటూరి నాగేశ్వరరావు తో పాటు పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, వేముల గోపాలరావు, మాదాల లక్ష్మీనరసింహం సహా పలువురు నేతలు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.

తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపించిన పట్టభద్రులకు కంచర్ల శ్రీకాంత్ ధన్యవాదాలు తెలుపగా, ఇదే ఉత్సాహంతో రాబోయే ఎన్నికల్లో కందుకూరు గడ్డపై పసుపు జెండా ఎగురవేస్తామని ఇంటూరి నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు.

తర్వాత ఇంటూరి నాగేశ్వరరావు , కంచర్ల శ్రీకాంత్ జండా ఊపి ర్యాలీ ప్రారంభించారు.

నియోజకవర్గం లోని అన్ని గ్రామాల నుంచి నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో వెలగపూడిలో జరుగునున్న ప్రమాణ స్వీకారానికి 50 కి పైగా వాహనాల్లో తరలి వెళ్లారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page