SAKSHITHA NEWS

MLA’s visit to Jeedimetla division as part of Pragathi Yatra…

ప్రగతి యాత్ర‘లో భాగంగా జీడిమెట్ల డివిజన్ లో ఎమ్మెల్యే పర్యటన…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ మేరకు గోదావరి హోమ్స్ మీదుగా పాదయాత్ర చేస్తూ ప్రశాంత్ నగర్, వెన్నెలగడ్డ వరకు ఆయా కాలనీల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు పరిశీలించి అక్కడక్కడా నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

గోదావరి హోమ్స్ లో రూ.69 కోట్లతో చేపడుతున్న ఎస్.ఎన్.డి.పి పనులు, రూ.40 లక్షలతో అభివృద్ధి చేస్తున్న పార్క్ ల అభివృద్ధి పనులు ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, సంపత్ మాధవ రెడ్డి, కనకయ్య, మాధవ రెడ్డి, జ్ఞానేశ్వర్, గుమ్మడి మధు సుదన్ రాజు, ఇందిరా రెడ్డి, నరేందర్ రెడ్డి, అరుణ రెడ్డి, కాలే నాగేష్, కుంటి మల్లేష్, నదీమ్ రాయ్, కాలే గణేష్, సమ్మయ్య నేత, శ్రీధర్ ముదిరాజ్, సుమీర్ సింగ్, దేవేందర్, శ్రీకాంత్, ప్రసాద్, నాగేష్ రెడ్డి, సంధ్య, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS