SAKSHITHA NEWS

ప్రగతి యాత్ర‘లో భాగంగా జీడిమెట్ల డివిజన్ లో ఎమ్మెల్యే పర్యటన…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని రామరాజ నగర్ లో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ మేరకు పాదయాత్ర చేస్తూ కాలనీలో అభివృద్ధి చేసిన పనులు పరిశీలించారు. అనంతరం మిగిలిన ఉన్న పనులు తెలుసుకున్నారు.

కాగా నూతన ట్రాన్స్ ఫార్మర్, ఓపెన్ జిమ్, నూతన డ్రైనేజీ లైన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. వాటి ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కృష్ణ కాంత్ రెడ్డి, జనరల్ సెక్రటరీ డివివి నాగేశ్వర రావు, ట్రెజరర్ రవీందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు సతీష్, రాజేశ్వరి, జాయింట్ సెక్రటరీలు నాగేశ్వర్ రావు, రాణి, జాయింట్ ట్రెజరర్ ప్రమోద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అయ్యప్ప రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గోవర్ధన్, సరళ, పార్వతి, అనురాధ, కిషోర్ కుమార్, భాస్కర్ మరియు వార్డు సభ్యుడు సుధాకర్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, గుమ్మడి మధుసుధన్ రాజు, జ్ఞానేశ్వర్, కాలే నాగేష్, కాలే గణేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS