SAKSHITHA NEWS

నిడమనూరు సాక్షిత ప్రతినిధి

నిడమనూరు మండల కేంద్రం రాంనగర్ కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకి నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా పనులు చేస్తున్నామని, నియోజకవర్గం అభివృద్దే తన ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ బొల్లం జయమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చేకూరి హనుమంతరావు, మండల పార్టీ అధ్యక్షులు తాటి సత్యపాల్, ప్రధాన కార్యదర్శి నల్లబోతు వెంకటేశ్వర్లు,పట్టణ అధ్యక్షుడు మాచర్ల దాసు, మార్కెట్ వైస్ చైర్మన్ మెరుగు రామలింగయ్య, మాజీ ఎంపీటీసీ ఉన్నం చిన వీరయ్య, బొల్లం సైదులు, ముప్పారం ఎంపీటీసీ భాస్కర్ నారాయణ, దేవస్థానం చైర్మన్లు దరిబు లింగప్ప, మేరెడ్డి వెంకటరమణ, మహిళా అధ్యక్షురాలు కళావతి మార్కెట్ డైరెక్టర్లు గోగుల వెంకన్న,లక్కుమల్ల మధుబాబు,ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆదిమల్ల భాస్కర్, నాయకులు తిరుపతయ్య, ఆనంద్, సింగం రామ లింగయ్య, శంకర్, జంపాల జానీ, ముడి సంపత్, తదితులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS