మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

Spread the love

మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

క్రోసూరు మండలం ఊటుకూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం స్వయంగా తిని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్నం భోజనం బాగుంటుందా..? మెనూ ప్రకారం అన్నీ అందిస్తున్నారా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు గుడ్డు ఇస్తున్నారా.. ఆహార పదర్థాలు ఎలా ఉంటున్నాయన్ని విషయాలు కూడా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు భోజనం బాగుందని చెప్పడంతో నిర్వాహకులను అభినందించారు. ప్రభుత్వం ఎంతో గొప్ప లక్ష్యంతో మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోందని.. విద్యార్థులను సొంత బిడ్డల్లా ఆదరించి నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై ఆరా తీశారు.

Related Posts

You cannot copy content of this page