మండలంలో సుడిగాలి పర్యటన చేసిన MLA మెచ్చా నాగేశ్వరరావు

Spread the love

అశ్వారావుపేట

మండలంలో సుడిగాలి పర్యటన చేసిన MLA మెచ్చా నాగేశ్వరరావు

సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న MLA మెచ్చా

అశ్వారావుపేట(మండలం), గుర్రాలచెరువు(శ్రీశ్రీశ్రీ కనక దుర్గ అమ్మవారు ఆలయం వద్ద) మరియు నారాయణపురం(కట్ట మైసమ్మ అమ్మ వారి ఆలయం వద్ద) జరిగిన ఆషాడ బోనాల మహోత్సవంలో అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఉన్న గ్రామస్థులతో ఆప్యాయంగా మాట్లాడుతూ సమయం గడిపారు ఆ గుర్రాలచెరువు కార్యక్రమంలో వద్ద ఆంధ్రా లో నివాసం ఉండే ఒక వ్యక్తి అక్కడే ఉన్న ఎమ్మెల్యే గారితో మాట్లాడుతూ తెలంగాణలో మళ్ళీ మీదే అధికారం అండి అంటూ ఆప్యాయంగా మాట్లాడాడు.అలాగే నారాయణపురం కాలని వద్ద గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే గారు.మంచి నీటి సమస్య ఉందని,ఇల్లు, సీసీ రోడ్లు కావాలని గ్రామస్థులు ఎమ్మెల్యే గారిని కోరడంతో సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గారు ఇల్లు ఇస్తానని,మంచి నీటి సమస్యలు వినాయకపురం లో బోర్ వేసి అక్కడ నుంచి పైప్ లైన్ల ద్వారా మంచి నీరు వచ్చేలా చేయాలని అధికారులను ఆదేశించారు.సీసీ రోడ్లు కూడా త్వరలో ఏర్పాటు చేస్తానని ఇప్పటికీ 2 రోడ్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
(గుర్రాలచెరువు నుంచి కేసప్పగూడెం వెళ్ళే మార్గం మధ్యలో వంతెన చిన్నగా ఉండటం వరద ఎక్కువ వస్తుందని తెలుసుకున్న MLA మెచ్చా నాగేశ్వరరావు గారు వెంటనే స్పందించి అంచనా వేసి ప్రభుత్వానికి సమర్పించాలని ఫోన్ లో సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.)

ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ,మండల BRS పార్టీ ప్రధాన కార్యదర్శి,MPTC లు,సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు,మండల నాయకులు,గ్రామ అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు,యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page