కొంపల్లిలో “ఇండియన్ స్వచ్ఛత లీగ్ ర్యాలీ”ని ప్రారంభించిన ఎమ్మెల్యే…

Spread the love

MLA launched “Indian Purity League Rally” at Kompally…

కొంపల్లిలో “ఇండియన్ స్వచ్ఛత లీగ్ ర్యాలీ”ని ప్రారంభించిన ఎమ్మెల్యే.


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లిలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఇండియన్ స్వచ్ఛత లీగ్ ర్యాలీ”ని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొంపల్లిని గార్బేజ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ప్రజలు సహకారం అందించాలని అన్నారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనకు అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉంటాయన్నారు.

చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రజలంతా బాధ్యతాయుతంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, కమిషనర్ రఘు, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, మాజీ ఎంపిపి సన్న కవిత శ్రీశైలం యాదవ్ మరియు అధికారులు, స్థానిక కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్, జిహెచ్ఎంసి డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page