SAKSHITHA NEWS

ప్రగతి యాత్ర‘లో భాగంగా చింతల్ డివిజన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ మేరకు ఎన్ఎల్ బి నగర్, పద్మశాలి బస్తీల్లో పాదయాత్ర చేస్తూ.. పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం మిగిలిన ఉన్న పనులు తెలుసుకున్నారు.

ఆయా పనులన్నీ త్వరలోనే పూర్తి చేయిస్తానని ప్రజలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తంగ లక్ష్మారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ మక్సుద్ అలీ, బస్వరాజు, శేఖర్ రావు, వెంకటేష్ గౌడ్, వహీద్ ఖురేషి, ప్రభాకర్ గుప్త, యోగ మల్లేష్, బాలునేత, గౌతమ్, రాచకొండ కుమార్, సాయి, శౌకత్ అలీ, డివిజన్ బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు స్వప్న, కవిత, భావన, వర లక్ష్మీ, అనురాధ, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS