‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 52వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

Spread the love

‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 52వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

కుత్బుల్లాపూర్ డివిజన్ సూర్యనగర్ లో పాదయాత్ర…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 52వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా సూర్యనగర్ లో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించి, మిగిలి ఉన్న డ్రైనేజీ, సీసీ రోడ్డు సమస్యను తెలుసుకున్నారు. కాగా ప్రజలకు అసౌకర్యం లేకుండా వెంటనే భూగర్భడ్రైనేజీ పనులు చేపట్టి.. పూర్తయిన వెంటనే సీసీ రోడ్డు నిర్మించేలా చర్యలు చేపట్టాలని అక్కడే ఉన్న అధికారులకు ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, నార్లకంటి బాలయ్య, మధుకర్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడు సురేష్, శివయ్య, అశోక్ గౌడ్, ఉదయ్ రాజ్ గౌడ్, భరత్, శ్రవణ్, కిరణ్, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page