ప్రగతి యాత్ర‘లో భాగంగా 43వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

Spread the love

ప్రగతి యాత్ర‘లో భాగంగా 43వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
జీడిమెట్ల డివిజన్ శ్రీనివాస్ నగర్, సాయినగర్ కాలనీల్లో పాదయాత్ర…
కోట్ల నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 43వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ నగర్, సాయి నగర్ కాలనీల్లో పాదయాత్ర చేస్తూ దాదాపు 90 శాతం పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా మిగిలి ఉన్న మేన్ రోడ్డు, వరద సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. అక్కడే ఉన్న అధికారులకు అందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గతంలో అనేక సమస్యలతో సతమతమైన తమ ప్రాంతంలో కోట్ల రూపాయల సహకారం అందించి రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వసతులు కల్పించి కాలనీ అభివృద్ధికి కృషి చేసినందుకు ప్రజలు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీల ప్రజలు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page