SAKSHITHA NEWS

ప్రగతి యాత్ర‘లో భాగంగా 29వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
చింతల్ డివిజన్ చంద్రానగర్, ఓల్డ్ చింతల్ కాలనీల్లో పాదయాత్ర…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ 128 డివిజన్ లో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 29వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రానగర్, ఓల్డ్ చింతల్ కాలనీల్లో పాదయాత్ర చేస్తూ దాదాపు పూర్తి చేసిన సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ తదితర పనులు పరిశీలించారు. కాగా చంద్రానగర్ లో రూ.1.90 కోట్లతో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసిన నేపథ్యంలో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం చింతల్ స్మశానవాటికను పరిశీలించి చేపట్టవలసిన పనులు తెలుసుకున్నారు.

అక్కడే ఉన్న అధికారులకు వాటిని త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓల్డ్ చింతల్ కాలనీలో చేపట్టవలసిన పనులు తెలుసుకొని త్వరలోనే పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సాగర్ రావు, సీనియర్ నాయకులు మహ్మద్ మక్సూద్ అలీ, డేగ కృష్ణమూర్తి, కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, దూసకంటి రవి, మురళి, వార్డు మెంబర్ మెహెరున్నిస బేగం, రామకృష్ణ, సూర్య ప్రకాష్, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శోభ, శ్రీనివాస్ రెడ్డి, నాయుడు, రాము, రమేష్, రామ్మూర్తి, బాలమని, కవిత, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS