మహిళా భాగస్వామ్యంతోనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద

Spread the love

కొంపల్లిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు…
కొంపల్లి మున్సిపాలిటీ సాయి కృప అపార్ట్మెంట్స్ లో నాలుగో డివిజన్ కౌన్సిలర్ మాడం శెట్టి సువర్ణ కృష్ణ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ మహిళలు లేనిదే మానవ మనుగడ లేదు, ఉనికి లేదు. నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారని, రాణించాలని మహిళ భాగస్వామ్యం ఉన్న దేశాలే వేగంగా అభివృద్ధి చెందాయన్నారు. తల్లిదండ్రులు బాలికలను చదివించి వారిని ప్రయోజకులు చేసినప్పుడే వారి తరతరాలు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు. ఇంట్లో మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచినట్లయితే ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కార్యక్రమ నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించారు.

అనంతరం వైద్య, విద్య, న్యాయ, రాజకీయ రంగాలలో విశేషంగా రాణిస్తున్న మహిళలను ఎమ్మెల్యే కేపీ.వివేకానంద సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు శ్రీవిద్య, సరిత, కో ఆప్షన్ సభ్యులు మంగమ్మ, బిఆర్ఎస్ మహిళా నాయకురాలు సంగీతా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, కౌన్సిలర్లు సన్న రవి, కొంపల్లి బిఆర్ఎస్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు కృష్ణ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page