ప్రగతినగర్ హిందూ స్మశానవాటికను పరిరక్షిస్తాం ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ పరిధిలోని హిందూ స్మశానవాటికను ఎమ్మెల్యే కె పి వివేకానంద్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ మహాప్రస్థానం గత 30 సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉందని, కానీ ఈ మధ్య కొందరు అసంఘాకిక వ్యక్తులు దీనిని ఆక్రమించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, వీరు ఎంతటి వారైనా ఉపేంక్షించేది లేదని, ఆక్రమణదారులపై చట్టరీత్య తగిన చర్యలు తీసుకుంటామని, అలాగే ఈ శ్మశానవాటిక చుట్టూరా ప్రహారి గోడ మరియు రోడ్డు తక్షణమే నిర్మించాలని సంభందిత అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ స్మశానవాటికను ఒక మోడల్ గ్రేవ్ యార్డుగా తీర్చదిద్దడానికి వ్యయప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు..

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు ఇంద్రజిత్ రెడ్డి, సురేష్ రెడ్డి, చిట్ల దివాకర్, బిఆర్ఎస్ పార్టి సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి, సుధీర్ రెడ్డి, రాములు నాయక్, ఆల్విన్ కంపెనీ రిటైర్డ్ ఎంప్లాయిస్ మరియు స్థానికులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page