SAKSHITHA NEWS

ప్రగతి యాత్ర‘లో భాగంగా 10వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

కుత్బుల్లాపూర్ డివిజన్ లోని పలు కాలనీల్లో పాదయాత్ర…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 10వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ మేరకు మాణిక్య నగర్ మీదుగా పాదయాత్ర చేస్తూ.. మధు సుదన్ రెడ్డి నగర్, ద్వారక నగర్ లలో చేపట్టిన అభివృద్ధి పనులను మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో కలిసి పరిశీలించారు. అనంతరం మిగిలిన ఉన్న పనులు తెలుసుకున్నారు.

వాటిని త్వరలోనే పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఉన్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపినందుకు కాలనీల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు,

మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కిషోర్ చారి, బాలయ్య, సురేందర్ రెడ్డి, ఆంజనేయులు, మహేష్, కలీల్, వెంకటేష్, నాగన్న, మల్లేష్, పుష్ప, అరుణ, మనోహర, లక్ష్మీ, మైసమ్మ, రజియ, శంకర్ దాస్, యాదగిరి, మధుకర్ రెడ్డి, వెంకటేష్, అజయ్, రామ్ చందర్, బ్రిజేష్, ప్రభాకర్, జయంచారి, శివానంద్, విఠల్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS