తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం”లో భాగంగా బుద్ధ విహార్ లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం రాజీవ్ గాంధీనగర్ బుద్ధ విహార్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా “తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం” సందర్భంగా బౌద్ధ మతస్తులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మతాలు, కులాలను సమానంగా గౌరవిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు మరియు విష్వరత్న బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page