SAKSHITHA NEWS

*సాక్షిత ; *బాలయ్య నగర్ లో రూ. 48 లక్షల వ్యయంతో చేపడుతున్నసీసీ రోడ్ మరియు రూ. 40 లక్షల వ్యయంతో ప్రభుత్వ మండల పాఠశాల నూతన భవనము ప్రారంభోత్సవం.

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని బాలయ్య నగర్ లో రూ. 48 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులు మరియు సుమారు రూ. 40 లక్షల వ్యయంతో శోధన లాబొరేటరీస్ వారు సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన ప్రభుత్వ మండల ప్రాథమిక పాఠశాల నూతన భవనము మరియు ప్రహరీ గోడ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేటీఆర్ సహకారంతో ప్రజా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ డివిజన్లో అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో శోధన లాబొరేటరీస్ సీఈఓ డాక్టర్ తోట గిరిధర్ , ఎండీ రాహుల్, జనరల్ మేనేజర్ సురేష్, అసిస్టెంట్ ఎంఈఓ రమేష్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులూ కస్తూరి బాలరాజు, కమలాకర్, పి శ్రీనివాస్ యాదవ్, అబిద్, సి వెంకటేష్, దిలీప్, మూస ఖాన్, ఇమ్రాన్, కాలనీ ప్రెసిడెంట్ నగేష్, జనరల్ సెక్రటరీ పార్వతి, మహిళా డివిజన్ అధ్యక్షురాలు సంధ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS