జగద్గిరిగుట్టలో పలు అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్..

Spread the love

సోమయ్య నగర్లో 13 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు…. *

రింగ్ బస్తి లో 12 లక్షల వ్యయంతో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు

126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సీసాల బస్తీలో రూ.17 లక్షలతో వ్యయంతో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 126 డివిజన్ జగద్గిరిగుట్ట పరిధిలోని సోమయ్య నగర్లో 13 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ మరియు రింగ్ బస్తి లో 12 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనుల మరియు సీసాల బస్తీలో రూ.17 లక్షల వ్యయంతో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు. ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపనలు చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి కాలనీ అభివృద్ధే తమ ధ్యేయం అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో అధికారులు, బిఆర్ఎస్ పార్టీ యూత్ అద్యేక్షులు సోమేశ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అద్యేక్షులు రుద్రా అశోక్, సయిద్ రషీద్, కృష్ణ గౌడ్, వేణు యాదవ్, హరిజత్ అలీ, మఖ్సూద్ అలీ, శశిధర్, పాపుల్ గౌడ్, సాజిద్, విట్టల్ ముదిరాజ్, నర్సింహా రెడ్డి, హాజి,శ్రీనివాస్, ప్రకాష్ , మెట్ల శ్రీను, మనోజ్, ముకేశ్, నాయకులు, కాలనీ సంక్షేమ సంఘ నాయకులు,సభ్యులు,కాలనీ వాసులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page