గాజులరామారం ప్రాథమిక పాఠశాలను అధికారులతో పరిశీలించిన ఎమ్మెల్యే…

Spread the love

రూ.36 లక్షలతో 4 తరగతి గదులు.. మౌలిక వసతులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం…

4 classrooms with Rs.36 lakhs..Directors to complete the infrastructure…సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం ప్రాథమిక పాఠశాల వద్ద ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ మేరకు శిథిలావస్థకు చేరుకున్న తరగతి గదులను ఎమ్మెల్యే పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదనంగా నాలుగు తరగతి గదుల నిర్మాణానికి తన బడ్జెట్ నుండి రూ.25 లక్షలు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అదే విధంగా మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.11 లక్షలతో టాయిలెట్స్, త్రాగు నీటి సరఫరా, కరెంటు సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. దీపావళి వరకు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆంజనేయులు, ఏఈ నాగేశ్వర్ రావు, ప్రిన్సిపాల్ వసంత, ఎంఆర్పి రమేష్ మరియు సీనియర్ టీఆర్ఎస్ నాయకులు ఇంద్రసేన గుప్త, రషీద్ బైగ్, కస్తూరి బాల్ రాజ్, హుస్సేన్, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, మూసాకాన్, గోవర్ధన్ రెడ్డి, ఇబ్రహీం, చందు ముదిరాజ్, మహేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page