SAKSHITHA NEWS

MLA GMR participated in the Mallanna Swamy fair

మల్లన్న స్వామి జాతర ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్
సాక్షిత : జిన్నారం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

జిన్నారం మండల పరిధిలోని శివానగర్, కాజిపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం, జాతర ఉత్సవాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామస్తులు సాంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. స్వామివారి ఆశీస్సులతో, నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.


SAKSHITHA NEWS