తాటిగుమ్మి గ్రామంలో సీయోను ప్రార్ధన మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

Spread the love

వీరులపాడు మండలంలోని తాటిగుమ్మి గ్రామంలో నూతనంగా నిర్మించిన సీయోను ప్రార్థన మందిర ప్రారంభోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమని.. సంఘస్తులందరూ సోదర భావంతో మెలగాలని సూచించారు. తోటి వారికి సహాయపడటమే ఏసుక్రీస్తు జీవిత సారాంశమన్నారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ని దైవ సేవకులు ప్రత్యేకంగా సత్కరించారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..

Related Posts

You cannot copy content of this page