మిషన్ భగీరథ మంచినీళ్ళు అందించాలి

Spread the love

మిషన్ భగీరథ మంచినీళ్ళు అందించాలి
— చికిలం మెట్ల అశోక్

చిట్యాల సాక్షిత ప్రతినిధి

మిషన్ భగీరథ నీళ్ళని అందిస్తామని అధికారులు నాయకులు నిర్లక్షం వహిస్తూ ప్రజలకి ఇబ్బందులు కలిగేలా చేస్తున్నారని బిజెపి నాయకులు చికీలం మెట్ల అశోక్ అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో మిషన్ భగీరథ మంచి నీళ్లు అందేటట్లుగా తక్షణమే చర్యలు తీసుకొని ప్రజల దాహాన్ని తీర్చాలని కోరారు. ఇప్పటికే అనేక ఇండ్ల ముందు నుంచి మిషన్ భగీరథ పైప్లైన్ వెళ్లిన ఇంకా కొన్ని ఇండ్లకి కలెక్షన్లు ఇవ్వకపోవడం వారికి మంచినీళ్లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే మిషన్ భగీరథ నల్లాలు ఏ ఇంటికైతే బిగించ లేదో తక్షణమే ఆ ఇంటికి నల్ల కలెక్షన్లు ఏర్పాటు చేసి మంచి నీళ్లు అందించాని లేనిచో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.

Related Posts

You cannot copy content of this page