జగనన్న లే అవుట్ భూముల్లో కూడా మంత్రి ఉషశ్రీ చరణ్ అవినీతికి పాల్పడింది;ఉమామహేశ్వర నాయుడు

Spread the love

జగనన్న లే అవుట్ భూముల్లో కూడా మంత్రి ఉష శ్రీ చరణ్ భారీగా అవినీతి చేశారని కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆరోపించారు. అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి దగ్గర ఉన్న జగనన్న లేఔట్ లో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నాసిరకంగా నిర్మించిన ఇళ్లతో ఉమామహేశ్వరనాయుడు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇళ్లను నిర్మించి మంత్రి ఉషశ్రీ చరణ్ ఫోటో సీఎం జగన్ ఫోటో మాత్రమే వేశారన్నారు. కాని ప్రధాని ఫోటో ఎక్కడ కూడా కనబడడం లేదన్నారు. ప్రభుత్వం దగ్గర ఎకరా రూ.25లక్షలు తీసుకుని , రైతులకు రూ.10 లక్షలు ఇచ్చి చేయి దులుపుకున్నారన్నారు. గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వనిధులు రాష్ట్ర ప్రభుత్వం నిధులతో నాణ్యమైన ఇండ్లను నిర్మించి ప్రజలకు ఇచ్చిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. జగనన్న లేఔట్లలో మౌలిక వసతులు కూడా లేవన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Whatsapp Image 2023 12 04 At 3.52.20 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page