పేద మహిళకు వైద్య ఖర్చులు మంజూరు చేయించిన మంత్రి తుమ్మల

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం నగరంలోని స్థానిక 46 వడివిజన్ లో నివాసం ఉంటున్న గవ్వల వీరమ్మ తీవ్ర వెన్నుపూస వ్యాధితో బాధపడుతున్న ఆమె వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు బాణాల లక్ష్మణ్ ను సంప్రదించగా ఆయన వెంటనే స్పదించి సమస్యను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లాగా వెంటనే స్పందించిన మంత్రి వారి కుటుంబ పరిస్థితిని అర్దం చేసుకొని సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆపరేషన్ ఖర్చు 2,50,000 రూపాయలు ఎల్ వో సి ద్వారా మంజూరు చేయించారు…

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి ఏ అపద వచ్చిన స్పందించి ఆదుకొనే విధానం పేదల పట్ల చూపించే పట్టు దల వారి పని తీరుకు నిదర్శనం… ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా బాదా పడుతున్న మాకు వైద్యం చేయించుకొలేక చావే శరణ్యం అనుకుంటున్న దశలో దేవుడి రూపం లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదుకున్నారు వారికి ఎల్లప్పుడూ మా కుటుంబం రుణ పడి వుంటుంది.. ఇలాంటి మంత్రి గారు దొరకడం ఈ జిల్లా ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాము ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు సాధు రమేష్ రెడ్డి, డివిజన్ నాయకులు మరాటీ బీరేష్, దయ్యాల నాగేశ్వర రావు,ఏమ్మే రామకృష్ణ, రేగు రవీందర్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page