పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9:30గంటలకు కూసుమంచి లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. ఉదయం 10గంటలకు జీళ్లచెర్వులో సీసీ రోడ్లను ప్రారంభిస్తారని తెలిపారు. ఉదయం 11గంటలకు నేలకొండపల్లి మండలం చెన్నారంలో ఆర్అండ్ బీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి అక్కడే కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12గంటలకు చెర్వుమాదారంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అదేవిధంగా ఒంటిగంటకు కైకొండాయిగూడెంలో సీసీరోడ్లకు, డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు మహబూబాబాద్ లో జరిగే మహబూబాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరవుతారని తెలిపారు. కావున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని మంత్రి పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.

Related Posts

You cannot copy content of this page