శాంతి స్వరూప్ లేరనే వార్త బాధాకరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

Spread the love


తెలుగు భాషలో మొదటి టెలివిజన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరనే వార్త ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన దూరదర్శన్ లో వార్తలు చదివే తీరు ప్రతి ఒక్కరి హృదయాలకు హత్తుకునేదన్నారు. దూరదర్శన్ పేరు చెప్పగానే ఆయన పేరే గుర్తొచ్చేదని, శాంతి స్వరూప్ చదివే వార్త బాధకరమైనదైన… సంతోషకరమైనదైన ఆయన హవా భావాల్లోనే తెలిసేదని పేర్కొన్నారు. ఆయన ఆదర్శప్రాయమైన జీవితం నేటి యువతకు స్ఫూర్తి దాయకమని తెలిపారు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో గుండె పోటుకి గురై తుదిశ్వాస విడిచారని తెలిసిందని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతని తెలియజేస్తున్నట్లు మంత్రి పొంగులేటి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Related Posts

You cannot copy content of this page