కాపుల కనపర్తి లో అభివృద్ధి పనులను ప్రారంభించిన :మంత్రి ఎర్రబెల్లి

Spread the love

వరంగల్ జిల్లా:
జిల్లా పర్యటనలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సంగెం మండలంలోని గుంటూరుపల్లె, కాపులకనపర్తి గ్రామాల్లో పర్యటించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

పంట నష్టపోయిన రైతులు ఎవరు అధైర్య పడొద్దన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అన్ని విధాల అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమమే లక్ష్యంగా రైతుబంధు, రైతుబీమా, రైతు వేదికలు వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావిణ్యతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page