ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన పై మంత్రి ఆదిమూలపు సురేష్ కామెంట్స్

SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన పై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కామెంట్స్.

దళితులను అవహేళన చేసిన బాబూ కొడుకులకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హత ఉందా?

దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా?… దళితులు ఏమి పీకలేరు. అని మీరు అనలేదా?

యర్రగొండపాలెం లో మీ పార్టీ ఇంచార్జి ఏరిక్షన్ బాబును కూడా నెల్లూరు మీటింగ్ లో చంద్రబాబు అవమానించలేదా?

ఏ చెట్టూ లేని చోట ఆముదపు వృక్షం లాంటి ఎరీక్షన్ బాబే అక్కడ మహా వృక్షం అని అనలేదా?

అలాంటి పార్టీలో ఈ దళిత నాయకులు ఎలా కొనసాగుతారో వారి విజ్ఞతకే వదిలేస్తున్న.

నీ హయాంలో కొత్త జిల్లాల విషయం గుర్తుకురాలేదు. ఇప్పుడు మార్కాపురం జిల్లా చేస్తానంటే ప్రజలు నమ్ముతారా?

జగనన్న కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటంతో పాటు ఒక జిల్లాకు ఎన్టిఆర్ పేరు కూడా పెట్టారు.

ఇన్నాళ్లు గుర్తుకురాని ఎన్టిఆర్ పేరు ఇప్పుడు ఎన్నికలు వస్తుంటే చంద్రబాబుకు గుర్తుకు వస్తుందేమిటి?

నీ పర్యటనలో జూనియర్ ఎన్టిఆర్ ఫ్లెక్సీ కనబడితే ఒప్పుకోవు… సభల్లో మాత్రం జై ఎన్టిఆర్ అని అంటావు. రెండు నాలుకల ధోరణి నీకే సాధ్యం.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page