మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్వతంత్ర కార్పొరేటర్లతో సమావేశం

Spread the love

సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు ,ఎస్. ఈ సత్యనారాయణ తో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్వతంత్ర కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారి వారి డివిజనన్ల లో నెలకొన్న పలు సమస్యలు, పెండిగ్ లో ఉన్న పలు నిర్మాణ అభివృద్ధి పనులు,మౌలిక సదుపాయాల గురించి చర్చా సమావేశం నిర్వహించడం జరిగింది. భాగంగా మేయర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి, పెండింగ్ దశలో ఉన్న పలు నిర్మాణ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. అనంతరం కార్పొరేషన్ పరిధిలో పలు నిర్మాణ అభివృద్ధి పనులపై సమీక్ష,అదే విధంగా వర్షా కాలం దృష్ట్యా కార్పొరేషన్ పరిధిలో రోడ్లు,డ్రైనేజ్ లు,SNDP నాలా నిర్మాణ పనులు పూర్తి,ట్రాఫిక్ ఇబ్బందులు, రోడ్ ప్యాచ్ వర్క్స్ ,పెరిగిన చెట్లు,విద్యుత్ తీగలు,స్తంభాలు,పురాతన నిర్మాణ సముదాయాల పట్ల జాగ్రత్త,వంటి విషయాలపై ఇంజినీరింగ్,టౌన్ ప్లానింగ్ ,శానిటేషన్,ఎలక్ట్రికల్,మాన్సూన్ టీమ్,ఆయా విభాగాల అధికారులతో సుధీర్ఘంగా చర్చించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు చిట్ల దివాకర్,బాలాజీ నాయక్,ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి ,కో ఆప్షన్ సభ్యుడు అభిషేక్ రెడ్డి,స్వతంత్ర కార్పొరేటర్లు వెంకట రామయ్య,శ్రీరాములు,సుజాత,NMC ఆయా విభాగాల అధికారులు,మరియు సిబ్బంది,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page