మీడియా సెంటర్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్

Spread the love

లోకసభ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్ ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి ప్రారంభించారు. మీడియా సెంటర్ లో ఏర్పాట్లను పరిశీలించారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని జిల్లా ఎన్నికల అధికారి సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సిఇఓ వినోద్, డిఆర్డీఓ సన్యాసయ్య, డిపిఆర్వో ఎం.ఏ. గౌస్, అదనపు పిఆర్వో వి. శ్రీనివాసరావు, పాత్రికేయులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page