మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి సందర్శించి, స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు

Spread the love

Mayor Mrs. Kolan Neela Gopal Reddy visited and paid special prayers to Swami.

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తో కలిసి మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ఇంఛార్జి కమిషనర్ రామకృష్ణా రావు , 30 వ డివిజన్ కార్పొరేటర్ కోలన్ మీనా సునీల్ రెడ్డి తో కలిసి స్థానిక డివిజన్ స్ప్రింగ్ వ్యాలీ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించి, స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది, ఆనంతరం స్థానిక కాలనీ వారి నిర్వహించిన సమావేశంలో పాల్గోని వారి కాలనీలో నెలకొన్న సమస్యలని పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది.

మరియు స్థానిక డివిజన్ జర్నలిస్ట్ కాలనీలో రోడ్లు మరియు డ్రైనేజీ సమస్యలపై పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే , మేయర్ మాట్లాడుతూ వారి కాలనీ సమస్యలనూ పరిష్కరించి,సకాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇవ్వడం జరిగింది..


ఈ కార్యక్రమంలో NMC ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ కార్పొరేటర్లు చిట్ల దివాకర్ ,సురేష్ రెడ్డి , మేకల వెంకటేష్ , గాజుల సుజాత, కోలన్ వీరేందర్ రెడ్డి , రాఘవేంద్ర రావు ,బొర్రా దేవి చందూ , సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ,ఆవుల జగన్ యాదవ్ , వెంగయ్య చౌదరీ , నర్సింహ రెడ్డి , బొర్రా చందూ , కోలన్ సునీల్ రెడ్డి , చంద్రగిరి సతీష్ , NMC బీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ , NMC మరియు ఆయా డివిజన్ బీఆర్ఎస్ అనుబంధ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు , స్తానిక డివిజన్ కాలనీల అసోసియేషన్ సభ్యులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page