తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి

Spread the love

సాక్షిత : ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,కమిషనర్ రామకృష్ణ రావు ,ప్రజాప్రతినిధులు,అధికారులతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గీతాలాపన చేయడం జరిగింది.అనంతరం అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పించి వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ జై తెలంగాణ అంటూ నినాదించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… కొట్లాడి తెలంగాణ సాధించి 9 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న మాన్య ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదములు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,సీనియర్ నాయకులు,NMC, ఆయా డివిజన్ అధ్యక్షులు,అనుబంధ కమిటీల సభ్యులు,యువ నాయకులు,మహిళా నాయకులు, కార్యకర్తలు అభిమానులు,NMC ఆయా విభాగాల అధికారులు, మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page