బిజెపి,బిఆర్ఎస్ లనుండి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక

Spread the love

బిజెపి,బిఆర్ఎస్ లనుండి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క *


సాక్షిత : ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వేంకటా పూర్ మండలం లోని పాపయ్యపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు బోడ రాములు
కేశవ పూర్ గ్రామానికి చెందిన
బిజెపి పార్టీకి నాయకులు కావటి భాస్కర్,అనుము రాజేందర్,గొల్ల పెల్లి రాజ కొమురయ్య,ఎలగొండ మొగిలి,తారల రమేష్ లు బిజెపి, బిఆర్ఎస్ పార్టీలను వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం ఖాయం అధికారం లోకి రాగానే ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ,500 కే గ్యాస్ సిలిండర్,పోడు భూములకు పట్టాలు నిరుద్యోగ భృతి
కౌలు రైతుకు రైతు బంధు రైతు భీమా సౌకర్యం,5 లక్షల తో ఇల్లు కట్టిస్తామని రాష్ట్రం లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీతక్క అన్నారు


దశాబ్ది ఉత్సవాల పేరుతో 1000 కోట్ల ప్రజా ధనం వృదా చెయ్యడం జరిగింది ఉత్సవాల మీద ఉన్న ప్రేమ పెద్దవాళ్ళ మీద ఉంటే బాగుండేది తెలంగాణ వస్తే మన బ్రతుకులు మారుతాయి మన భాదాలు తీరుతాయి నమ్మిన ప్రజలను కెసిఆర్ చేసింది ఏమి లేదని కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారం లోకి రావడం కోసం ఒక్క అవకాశం ప్రజలు ఇవ్వాలని సీతక్క అన్నారు
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మూడు వీరేశ్
గ్రామ కమిటీ అధ్యక్షులు చెన్నోజు శ్రీనివాస్,
కొండ తిరుపతి,మాజీ సహకార సంఘం వైస్ చైర్మన్ పచ్చి మట్ల రాంబాబు,సహకార సంఘం డైరెక్టర్ నక్క సదయ్య
యూత్ కాంగ్రెస్ నాయకులు కట్టే కోళ్ల వెంకటేష్,యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు చిర్ర హరీష్,జీవన్
ప్రభుదాస్,శంకర్ తదితరులు ఉన్నారు

Related Posts

You cannot copy content of this page