రేణుక ఎల్లమ్మ దేవాలయానికి మంత్రి భూమి పూజ

Spread the love

కరీంనగర్ జిల్లా:
రాష్ట్రంలో అన్ని కులసంఘాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలియజేశారు.

శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ… అన్ని కుల సంఘాలకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు.

ఇప్పటికే చాలా సంఘాలకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, గ్రంధాలయ చైర్మన్ పొన్నం అనిల్,కార్పొరేటర్లు జంగిల్ ఐలేందర్ యాదవ్, భూమా గౌడ్, గుగ్గిళ్ల జయశ్రీ-శ్రీనివాస్,నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చల్ల హరి శంకర్ మరియు గౌడ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…..

Related Posts

You cannot copy content of this page