కర్నూలు జిల్లాలో నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో నిన్న పాల్గొని లోకేష్ బాబు

Spread the love

కర్నూలు జిల్లాలో నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో నిన్న పాల్గొని లోకేష్ బాబు తో పాటు కలిసి నడిచిన తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్.

సాక్షిత : కర్నూలు జిల్లా ఆదోని, నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో నిన్న పాల్గొని, ఈనెల 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా చేపట్టే వేడుకల గూర్చి నారా లోకేష్ బాబు తో చర్చించిన రాజేంద్రప్రసాద్.

ఈ సందర్భంగా వైవిబి. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా, ఆదోని నియోజకవర్గం లో చేసే పంచాయితీ రాజ్ దినోత్సవ వేడుకలకి ముఖ్యఅతిథిగా పంచాయతీరాజ్ మాజీ మంత్రి నారా లోకేష్ బాబు ని ఆహ్వానించడం జరిగిందని, దానికి ఆయన అంగీకరించి తప్పకుండా ఆసభలో పాల్గొని మీ సర్పంచ్ ల సమస్యలు తెలుసుకుని, వాటిపై అధ్యయనం చేస్తానని హామీ ఇచ్చారని రాజేంద్రప్రసాద్ తెలియజేశారు . కావున రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు మరియు ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ మధ్యాహ్నం 3 గంటలకు ఆదోని నియోజకవర్గం లో జరిగే ఈ వేడుకల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా రాజేంద్రప్రసాద్ విజ్ఞప్తి చేశారు

Related Posts

You cannot copy content of this page