సీసీ రోడ్ పనులు జరుగుతున్న సందర్బంగా స్థానికులకు పలు సమస్యలు ఉన్నాయి

Spread the love

రామచంద్రపురం డివిజన్ ఓల్డ్ రామచంద్రాపురంలో ఉన్న పాషా కాలనీ,ఎస్సీ బస్తి(3వ బ్లాక్) లో బస్తి దర్శన్ కార్యక్రమం నిర్వహించిన స్థానిక కార్పొరేటర్.బస్తి దర్శన్తో మంజూరు అయినా సీసీ రోడ్ పనులు జరుగుతున్న సందర్బంగా స్థానికులకు పలు సమస్యలు ఉన్నాయి అని తెలిసి రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగ డీఈ నరేందర్,ఏఈ ప్రభు తో కలిసి సమస్య తెలిపిన ప్రదేశాలలో పరిశీలించడం జరిగింది.

రోడ్ విస్తరణ కావాలి అని,అలాగే రోడ్ మధ్యలో ఉన్న కరెంటు స్థంబాలు మార్చుట కొరకు తెలిపిన స్థానికులు,మీరు తెలిపిన సమస్యలు పరిష్కరించే రోడ్ వేస్తాం అని కార్పొరేటర్ తెలిపారు.వారితో ఊరెళ్ళ యాదగిరి,చాంద్,గౌస్,రఫీక్,చిగురు శ్రీను,సీఎం మల్లేష్,బంటు నర్సింహా,డప్పు యాదయ్య,ప్రసాద్,కైతలాపురం శ్రీను,బ్యాండ్ శ్రీను,సురేష్,తదితరులు.

Related Posts

You cannot copy content of this page