ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

Spread the love

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్””మీతో నేను” కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్టణ పరిధిలోని 3వ వార్డు మరియు 15వ వార్డులో ఉదయం 06:30 AM నుండి 10:30 AM వరకు పర్యటించారు.
రైల్వే వంతెన పై విద్యుత్ దీపాలు వెంటనే అమర్చాలని సంబంధిత శాఖ వారిని ఆదేశించారు.
3, 15వ వార్డులలో కొన్ని ప్రదేశాల్లో థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట నూతన స్థంబాలు ఏర్పాటు చేయాలని, కాలనీలల్లో ఇళ్లపై వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని, రోడ్డు మధ్యలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ మరో ప్రదేశానికి మార్చాలని మరియు తదితర విద్యుత్ సమస్యలను పరిష్కారం చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.
విద్యుత్ తీగలకు తాకుతున్నటువంటి చెట్టు కొమ్మలను నరికివేయాలన్నారు.


కాలనీలల్లో త్రాగునీటి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ… నీటి సమస్య రాకుండా చూడాలన్నారు.
వార్డులలో అండర్ డ్రైనేజ్ మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page