కారు గుర్తుకే ఓటేద్దాం – బీఆర్ఎస్ పార్టీ నే గెలిపిద్దాం

Spread the love

శేరిలింగంపల్లి లో భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తాం

ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గా గాంధీ ని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాం

ఆల్విన్ కాలనీలో ప్రచారం చేసిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరేకపూడి గాంధీ ని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి 124 డివిజన్ తరపునుండి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డివిజన్ పరిధిలోని మొగులమ్మ కాలనీ, పీజేఆర్ నగర్ ఫేస్ 2, గాంధీ నగర్, గురు గోవింద్ సింగ్ నగర్ కాలనీలలో ఇంటింటికి వెళ్లి కాలనీ వాసులను ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం అని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పేదలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ కి శ్రీరామ రక్ష అని తెలియచేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తొమ్మిది ఏండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నట్లు తెలిపారు. పాదయాత్ర చేస్తూ ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనులను ప్రజలు మరిచిపోలేదని, ఎవరింటికి వెళ్లిన ఆసరా పెన్షన్, కల్యాణ లక్ష్మీ వంటి వాటి గురించే మాట్లాడుతున్నారని అన్నారు. తనతో పాటు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, మహిళలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియచేసారు. మనందరం బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం సమిష్టిగా పనిచేసి గాంధీ కి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, అనుబంధ మరియు బస్తి కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులు, బస్తి వాసులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 06 At 4.34.34 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page