ఉప్పెనై ఉద్యమిద్దాం… తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడుకుందాం : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

Spread the love

ఛలో నల్లగొండ” కెసిఆర్ భారీ బహిరంగ సభకు ఎమ్మెల్సీ, ఎమ్మేల్యే అధ్వర్యంలో భారీగా తరలి వెళ్ళిన కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ శ్రేణులు…

కాంగ్రెస్ అనుభవ రాహిత్యంతో సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ ప్రాంతం నేడు ఎడారిగా మారే పరిస్థితి నెలకొందని, తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడాలంటూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన “ఛలో నల్గొండ” భారీ బహిరంగ సభకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 8 డివిజన్లు, నిజాంపేట్ కార్పొరేషన్, కొంపల్లి – దుండిగల్ మున్సిపాలిటీ ల నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు.

ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, నిజాంపేట్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, దుండిగల్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page