సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

Spread the love


Legislators Dr. Gopireddy Srinivasa Reddy who participated in the Semi-Christmas celebrations *

సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

సాక్షిత : నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాత్రి నరసరావుపేట మండలంలోని పెట్లూరి వారి పాలెం గ్రామంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు, పాస్టర్లకు బట్టలు పంపిణీ చేశారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ప్రేమ కరుణను ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి యేసు క్రీస్తు అన్నారు. ప్రపంచం అంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్టమస్ అని అన్నారు. దావీదు పట్టణములో నేడు ప్రభువైన యేసుక్రీస్తు జన్మించెను అని పరిశుద్ద గ్రంథంలోని వాక్యాలను వివరించారు

గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ వ్యాప్తంగా చర్చిల అభివృద్ధికి సీఎం జగన్ రూ.175 కోట్ల నిధులను కేటాయించారని అన్నారు. ఈ నిధులను చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు ప్రభుత్వం వినియోగించనున్నట్లు తెలిపారు.

ఈ మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.కోటి మేర అందించనుందన్నారు. కొత్త చర్చిల నిర్మాణం, పాత చర్చిల పునర్నిర్మాణం, మరమ్మతులు, చర్చి నిర్వహించే సంస్థలు, స్మశాన వాటికల ఆధునీకరణకు ఈ నిధులు వెచ్చించనున్నట్లు తెలిపారు

Related Posts

You cannot copy content of this page