జక్కుల రాధసులోచన కు నివాళులర్పించిన ఖమ్మం ఎంపీ

Spread the love
Khammam MP Nama Nageswara Rao paid tribute to Jakkula Radhasulochana

జక్కుల రాధసులోచన కు నివాళులర్పించిన ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు


[

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

టి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు, రజక సంఘం నాయకులు జక్కుల వెంకటరమణ మాతృమూర్తి జక్కుల రాధసులోచన ఇటీవల అనారోగ్యంతో అకాలమరణం పొందారు.

ఈ సందర్భంగా నగరంలో వెంకటరమణ నివాసానికి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు వచ్చి పరామర్శించారు. ఈ సందర్భంగా కీ,శే. జక్కుల రాధసులోచన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబానికి తన ప్రగాడ సంతాపాన్ని, సానుభూతి ని ఎంపీ నామా తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, మాజీ మునిసిపల్ కౌన్సిలర్, డీసీఎంఎస్ డైరెక్టర్ జక్కుల లక్ష్మయ్య, గొట్టేపర్తి శ్రీనివాస్, బాసాటి హనుమంతరావు, రేగళ్ల శేషు, జక్కుల సత్యనారాయణ, జక్కుల వెంకన్న, జక్కుల వీరు, జక్కుల రాఘవేంద్ర, రేగళ్ల రాణి, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page