జగద్గిరిగుట్ట నుండి బీజేపీ లోకి చేరికలు

Spread the love

బీజేపీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ …


*సాక్షిత : *జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి భూదేవి హిల్స్ కాలనీ లోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో ఐలి తిరుపతి గౌడ్, సైదులు, సగ్గం నరసింహ, యాదగిరి, రవి చారీ, శ్రీనివాస్, జనార్దన్, రాజనీష్, అయోధ్య, శివ గౌడ్, శేఖర్ సాగర్, ప్రభాకర్ సాగర్, సత్యం, వెంకన్న, బాపూజీ, సుమన్, రాయుడు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు పున్నా రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మేకల సురేష్ రెడ్డి, డివిజన్ నాయకులు మహేందర్, నరేష్, వసుంధర, శ్రవణ్, అరుణ రెడ్డి, అరుణ్, అభిలాష్, పరశురామ్, ప్రమోద్, సాంబయ్య, రాకేష్, ముప్పిడి రవి, లక్ష్మణ్, రంగయ్య తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page