ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు…

Spread the love

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎన్నికల ఇంచార్జ్ శంభీపూర్ రాజు సమక్షంలో బాచుపల్లి ప్లజెంట్ విల్లాస్ కు చెందిన ప్రగతి విద్యా సంస్థల అధినేత, టీడీపీ నాయకులు సంకినేని శ్రీధర్ రావు తన అనుచరులతో కలిసి శంభీపూర్ కార్యాలయంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్సీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. పార్టీలో లో చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు శ్రీధర్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రత్నాంజి, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, సాయిరాం, శివ, దేవరాజ్, తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 13 At 10.53.17 Am

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page