వీధి వ్యాపారులకు అండగా జైభీమ్ రావ్ భారత్ పార్టీ నిలుస్తుంది

Spread the love

ఎన్నికల ప్రచారంలో జేబీపీ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ .

వీధి వ్యాపారస్తులకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైనా తమ వంతుగా అండగా ఉంటామని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) పల్నాడు జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సత్తెనపల్లి పురవీధుల్లో ఆయన పర్యటించారు.

జీవనోపాధి కోసం ప్రతి ఒక్కరూ వివిధ వృత్తులలో ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధం కీలకమని చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జైభీమ్ రావ్ భారత్ పార్టీ తరుపున సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాని చెప్పారు. మీ అమూల్యమైన ఓటు ను స్థానికుడ్ని…,యువకుడ్ని…. విద్యావంతుడైన జొన్నలగడ్డ విజయ్ కుమార్ అనే నాకు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు అనంతరం కొబ్బరి బొండాలు కొట్టటం., పుచ్చకాయలు కోసి విక్రయించటం., సోడాలు కొట్టి దాహార్తుల దాహం తీర్చటం వంటి పనులు చూపరులను ఆకట్టుకున్నాయి….

Related Posts

You cannot copy content of this page