SAKSHITHA NEWS

పూలమాలలతో ఎమ్మెల్యేకు సన్మానం

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

శేరిలింగంపల్లి లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుగనకు రాత్రింబవళ్లు కృషిచేసిన పార్టీ కార్యకర్తలు, ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు.. రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం సాధించిన ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ..బీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. శేరిలింగంపల్లి డివిజన్ లోగల గచ్చిబౌలి స్టేడియం నుండి తారనగర్ శ్రీశ్రీశ్రీ తుల్జ భవాని ఆలయం వరకు విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. అనంతరం తుల్జ భవాని అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించుకుని ర్యాలీ కొనసాగించారు. శేరిలింగంపల్లి డివిజన్ లో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి, బాణాసంచాలు కాలుస్తూ..మిఠాయిలు తినిపిస్తూ సంబరాలు చేసుకున్నారు. కార్పొరేటర్ ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ను కలిసి పూలు, శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గా అరేకపూడి గాంధీ గెలిచినందుకు ఆనందోత్సాహాలలో తేలుతున్నారు.

Whatsapp Image 2023 12 04 At 8.42.06 Am

SAKSHITHA NEWS