జగన్ నామినేషన్ దాఖలు తేదీ ఏప్రిల్ 22న…

Spread the love

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22 వ తేదీన పులివెందులలో నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.

ఈ నెల 18 వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయటంతో నామినేషన్ దాఖలు చేసుకోటానికి వీలు అవుతుంది. దీంతో సీఎం జగన్ ఈ నెల 21న తన సొంత నియోజక వర్గానికి చేరుకొని రెండు రోజులు అక్కడే మకాం వేయనున్నట్లు తెలుస్తోంది.

ఆ రెండు రోజులు జగన్ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పులివెందుల నియోజక వర్గంలో తన తరుపున తన సతీమణి భారతీ రెడ్డికి ప్రచార బాధ్యతలు అప్పగించి, జగన్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర కొనసాగిస్తారని సమాచారం.

Related Posts

You cannot copy content of this page