సమస్యలు పరిష్కరించాలి: బాపట్ల జిల్లా ఎస్పీ

Spread the love

ముఖ్య ప్రాధాన్యతతో స్పందన ఫిర్యాదు దారుల సమస్యలు పరిష్కరించాలి: బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్,

సాక్షిత బాపట్ల : ప్రజా సమస్యల పరిష్కారం కొరకు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నందు “స్పందన” కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలమూలల నుండీ విచ్చేసిన ప్రజలు తమ బాధలు, సమస్యలను స్వేచ్ఛగా జిల్లా ఎస్పీ కి స్వయంగా విన్నవించుకున్నారు. ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి కుటుంబ కలహాలు, ఆర్థిక నేరాలు, భూతగాదాలు మరియు ఇతర సమస్యలపై 61 పిర్యాదులు వచ్చినవి.

జిల్లా ఎస్పీ పిటీషనర్లతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ల పరిధిలోని అధికారులతో ఫోన్ చేసి స్వయంగా మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోని, భాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.

Related Posts

You cannot copy content of this page