‘జగనన్న సురక్ష’ కార్యక్రమం లో శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు..

Spread the love

‘జగనన్న సురక్ష’ కార్యక్రమం లో శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు..

సమస్య లను క్షేత్ర స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యం..

వినుకొండ రూరల్ మండలం నరగాయిపాలెం గ్రామం నందు నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమం లో పాల్గొన్న శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు గారు మరియు మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది…

ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ……
అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలిపోకూడదన్న తపన, తాపత్రయంతో ప్రతి ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితోనే ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నెలరోజులపాటు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చారని పేర్కొన్నారు.


ఇప్పటికే రాష్ట్రంలో శాచ్యురేషన్‌ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేసిన జగనన్న ప్రభుత్వం.. అర్హులై ఉండి ఏ కారణంతోనైనా ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో ఈ ‘జగనన్న సురక్ష‘ ద్వారా ఇంటింటినీ జల్లెడ పట్టనుందని, తద్వారా వారికి లబ్ధి చేకూర్చడంతో పాటు వారికింకేమైనా సర్టిఫికెట్లు (జనన, మరణ, కుల, సీసీఆర్సీ, రేషన్‌ కార్డు డివిజ¬న్, హౌస్‌ హోల్డ్‌ డివిజన్, ఇన్‌కమ్‌ మొదలైన 11 రకాల ధ్రువీకరణపత్రాలు) అవసరమైతే సర్వీస్‌ ఫీజు లేకుండా వాటిని ఉచితంగా అందించనుందని తెలిపారు.

ప్రతి ఇంటిని సందర్శించి నేరుగా సమస్యలను స్వీకరించి..
వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, జగనన్న మీద, జగనన్న ప్రభుత్వం మీద ప్రేమ, అభిమానం ఉన్న ఉత్సాహవంతులతో కూడిన టీమ్‌ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటినీ సందర్శిస్తుందని, అర్హులై ఉండి ఎక్కడైనా లబ్ధి అందని వారుంటే వారిని గుర్తించి సమస్య పరిష్కారానికి కావాల్సిన పత్రాలు సేకరిస్తారని, వారికేమైనా కుల, ఆదాయ, జనన మొదలైన సర్టిఫికెట్లు అవసరమైతే వాటికి అవసరమైన పత్రాలను తీసుకుని దరఖాస్తులను వారు దగ్గరుండి పూర్తిచేస్తారని అన్నారు.

సమస్య పరిష్కారమయ్యే వరకు తోడుగా..

ఇలా తీసుకున్న దరఖాస్తులను సచివాలయానికి తీసుకెళ్లి వాటిని అక్కడ సమర్పించి, టోకెన్‌ నంబర్, సర్వీస్‌ రిక్వెస్ట్‌ నంబరు తీసుకుని వాటిని తిరిగి ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తారు.

అనంతరం జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అర్హులైన వారికి వారు దరఖాస్తు చేసుకున్న అర్హుత పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

Related Posts

You cannot copy content of this page