దాములూరులో అభివృద్ధి, సంక్షేమానికి రూ.8.91 కోట్లు

Spread the love

దాములూరులో అభివృద్ధి, సంక్షేమానికి రూ.8.91 కోట్లు

మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాదు వెల్లడి

ఇబ్రహీంపట్నం

దాములూరు సచివాలయం పరిధిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం రూ.8.91,13,600లు ఖర్చు చేసినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు వెల్లడించారు. దాములూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు శనివారం పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన మూడేళ్లలో జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం రూ.6,35,33,600లను లబ్ధిదారులకు చెల్లించినట్లు పేర్కొన్నారు. అభివృద్ధికి రూ.2,55,80,000లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. దాములూరు గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గడపలో ఆయనకు విశేష ఆదరణ లభించింది. స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page