SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల శ్రేయస్సుకై అందిస్తున్న వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్లను 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతులమీదుగా డివిజన్ లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు అందించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కార్మికుల రక్షణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రక్షణ కిట్లను కార్మికులందరు ధరించి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, పోశెట్టిగౌడ్, SFA మల్లేష్, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS